హైదరాబాద్: వచ్చిన తెలంగాణ బాగు పడాలంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం ఏకం కావాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే సీమాంధ్ర పార్టీలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్న టీడీపీలో తెలంగాణ టీడీపీ నేతలు ఇంకా ఎలా కొనసాగుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎవరైతే టీఆర్ఎస్ గల్లంతవుతుందని వ్యాఖ్యలు చేశారో వాళ్లే ఇవాళ కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment